![]() |
![]() |
.webp)
కార్తీక్ దేవుడి గదిలో పూజ చేసి దీప గురించి మొక్కుకుంటాడు. దీప నిద్ర లేవడంతోనే నీరసంగా ఉంటుంది. "నాకేంటి ఈ రోజు ఇలా ఉంది" అని బాధపడుతుంది. ఇంతలో దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు. దీపకి హారతి ఇస్తాడు. "డాక్టర్ బాబు.. మీరు పూజ చేసారా?" అని దీప అంటుంది. దానికి కార్తీక్ " నీకోసమే చేశాను" అని అంటాడు. మరోవైపు చారుశీలను కలవడానికి సౌందర్య హాస్పిటల్ కి వస్తుంది. "శౌర్య కోసం రాసిన మందుల చీటి పట్టుకొని వచ్చి, ఇది ఎవరు రాసారు" అని చారుశీలని అడుగుతుంది సౌందర్య. "కార్తిక్ రాశాడని డౌట్ వచ్చినట్టుంది ఆంటికి" అని మనసులో అనుకుంటుంది చారుశీల. "ఇది నా కొడుకు హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది" అని సౌందర్య అంటుంది. దానికి చారుశీల కంగారుపడి "లేదు ఆంటి.. నేనే రాశాను" అని చెప్తుంది.
ఆ తర్వాత హాస్పిటల్ నుండి సౌందర్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న ఆనందరావుని కలుస్తుంది. అతనితో మాట్లాడుతూ "కార్తీక్, దీప కన్పించాలని దేవుడిని మొక్కుకుందాం" అని చెప్తుంది. ఆ తర్వాత కార్తిక్, దీపలని వెతకాడానికి వెళ్తుంది సౌందర్య. అలా బయటకు వెళ్లే టైంకి అనుమానం వచ్చి, ఇంద్రున్ని పిలుస్తుంది. "ఇంద్రుడు.. నా కొడుకు, కోడలు ఎక్కడున్నారో, నీకు తెలుసు కదా? నీ భార్య మీద ఒట్టేసి చెప్పు" అని నిలదీస్తుంది సౌందర్య. దానికి ఇంద్రుడు తన భార్య మీద ఒట్టేసి "నిజంగానే నాకేం తెలియదు. ఎప్పుడు వాళ్ళని చూసింది లేదు" అని చెప్తాడు. అది విని నమ్మేస్తుంది. ఆ తర్వాత సౌందర్య బయటకు వచ్చేస్తుంది. మరో వైపు కార్తీక్ నిద్ర నుండి లేచి దీప దగ్గరికి వస్తాడు. "నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావ్?" అని దీపని కోపగించుకుంటాడు. దానికి దీప మాట్లాడుతూ "నా జబ్బు కంటే, మీరు చేసే చేష్టలు చూస్తుంటేనే భయమేస్తుంది. ప్రతిసారి మీరు నాకు జబ్బుని గుర్తు చేస్తున్నారు" అని అంటుంది.
ఆ తర్వాత సౌందర్య వెతుక్కుంటూ.. దీప, కార్తీక్ లు ఉన్న ఇంటికే వస్తుంది. అలా ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఏం జరుగుతుందో? తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
![]() |
![]() |